ఎమ్.ఎస్. సుబ్బలక్ష్మి గారు భారతీయ కర్ణాటక సంగీత సమ్రాజ్ఞి. ఆమె గాత్రం ద్వారా భక్తి, భావన, వినయం ప్రపంచానికి పరిచయం చేశారు. వెంకటేశ సుప్రభాతం, భజ గోవిందం వంటి గీతాలతో కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. 1966లో యునోలో కచేరీ ఇచ్చిన తొలి భారతీయ కళాకారిణి అయ్యారు. భారత రత్నతో పాటు పద్మవిభూషణ్, రామన్ మాగ్‌సెసే వంటి అనేక అవార్డులు అందుకున్నారు.

సాంప్రదాయ సంగీతంలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన తొలి భారతీయ మహిళ.

 ఆమె పాడిన భక్తి గీతాలు, ముఖ్యంగా వెంకటేశ సుప్రభాతం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

ఆమె చేసిన కచేరీలు కేవలం వినోదం కోసం కాదు; చాలావరకు చారిటీ ఫండ్రైజింగ్ కోసం నిర్వహించేవారు.

తెలుగు, తమిళం, హిందీ, సంస్కృతం, బెంగాలీ వంటి అనేక భాషల్లో గీతాలు ఆలపించారు.

యునెస్కో వారిచే “ప్రపంచ శాంతి రాయబారి”గా గౌరవించారు.

గాంధీజీ ఆమెను “క్వీన్ ఆఫ్ మ్యూజిక్” అని అభివర్ణించారు.

మహిళలు కూడా సంగీతంలో శిఖరాలను అధిరోహించగలరని నిరూపించిన మహానుభావురాలు.

ఆమెను "కర్ణాటక సంగీత సమ్రాజ్ఞి"గా ప్రపంచం గుర్తించింది.

ఆమె గాత్రం తరతరాలకు ప్రేరణ, ఇప్పటికీ  సంగీతం నేర్చుకునే వారికి ఆదర్శం.