యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే యోగాలో ఏ ఆసనం వేసినా చివరకు శవాసనం వేయాలి. అనేక ప్రయోజనాలు పొందుతారు. 

శాంతి ఆసనం, అమృతాసనం, శవాసనం ఇలా ఏ పేరుతో పిలిచినా ఒకటే. కొన్ని శతాబ్దాలుగా మెదడులోని శక్తిని ఉత్తేజితం చేసేందుకు ఉపయోగిస్తున్న ఆసనమే శవాసనం. 

శవాసనం ప్రధానంగా ఇది మెదడుపై ఒత్తిడిని తొలగించి ప్రశాతంతనిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. 

శవాసనాన్ని వేసే ముందు పేరుకు తగ్గట్టుగానే శవంలాగే ముందు వెల్లకిలా పడుకోవాలని. మోచేతులను, కాళ్లను చాపి ఉంచి కళ్లు మూసుకుని ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలి. 

శవాసనాన్ని యోగా ప్రక్రియ ముగించే సమయంలో వేయాలి. యోగాసనాల్లో దీనికి అత్యున్నత ప్రాముఖ్యం ఉంది.

శవాసనంలో శరీరంలో కదలికలను నియంత్రిస్తూ శవం మాదిరిగా నిశ్చలంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. దీని ఫలితంగా శ్వాస మీదనే ధ్యాస ఉంచడం సాధ్యమవుతుంది. 

శవాసనాన్ని రెగ్యులర్‌గా వేస్తుండటం వల్ల మెదడు నిర్మాణంలో మార్పులు కలుగుతాయి. కొత్త కొత్త విషయాలను నేర్చుకునేందుకు కావాల్సిన ఏకాగ్రతతో పాటు, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 

భావోద్వేగ నియంత్రణతో సంబంధం ఉన్న మెదడులోని ప్రాంతాలలో గ్రే మ్యాటర్ పెంచుకునేందుకు సహాయపడుతుంది.