చాలామందికి ఉదయం లేచి బ్రష్ చేయగానే టీ తాగే అలవాటు ఉంటుంది. మన దేశంలో పాలు, టీ పౌడర్, షుగర్‌, ఇతర ఇంగ్రీడియంట్స్‌తో చేసే మిల్క్ టీ చాలా పాపులర్.

కొందరు రుచి లేదా స్ట్రాంగ్‌నెస్ పెంచడానికి మిల్క్ టీని ఎక్కువసేపు మరిగిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. 

ఎక్కువసేపు మరిగిస్తే మిల్క్ టీలో అనేక హానికరమైన పదార్థాలు ఏర్పడే అవకాశముంది. కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ సమ్మేళనాలు ఏర్పడతాయి. వాటిలో ముఖ్యమైనది మైల్లార్డ్ రియాక్షన్.

ఎందుకంటే ఎక్కువసేపు మరిగించినప్పుడు మిల్క్ టీ కెమికల్ కాంపోజిషన్ మారవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు

టీని అతిగా మరిగించడం వల్ల పాలతో తయారు చేసిన 'టీ' వల్ల లభించే శక్తి తగ్గిపోతుందట. 

'టీ'ని నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. శరీరంలోకి చేరిన ఐరన్‌ను శరీరం గ్రహించలేకపోతున్నట్టు నిపుణులు గుర్తించారు. 

ఎక్కువగా మరిగించిన 'టీ' తాగితే జీర్ణ సమస్యలు, కడుపునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'టీ'ని అతిగా మరిగిస్తే అన్ని పోషకాలు పోతాయి. 

అలాగే టీ ని ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్‌ బి, బి12, సి పోతాయి. ఇలా అన్ని రకాల పోషకాలను కోల్పోయిన 'టీ'ని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 

అందుకే 'టీ'ని 3 నుంచి 5 నిమిషాల మధ్య మరిగించడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.