ముఖం మెరవాలంటే.. ముద్దబంతి పువ్వు మంచిది

ముద్దబంతి పువ్వును మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.

దానికి పెరుగు, తేనె, చందనం పొడి, నిమ్మరసం కలపాలి.

చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాయాలి. 

15 నుంచి 20 నిమిషాలు ఆగి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి