పేరుకు ఉత్తరాది భామ అయినా తెలుగు సినిమాలతో కియారా అద్వానీకి మంచి అనుబంధమే ఉంది. 

టాలీవుడ్ లో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అను నేను’ సినిమాతో పరిచయమైంది.  

ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది.  

త్వరలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 ఇందులో కియారా పాత్రకు మంచి ప్రాధాన్యతే ఉందట. హీరోతో సరిసమానమైన పాత్రలో అలరించబోతుంది.    

కియారా కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన తోటి నటుడు సిద్ధార్ధ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది. 

వీరి వివాహం గతేడాది ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యఘర్ ప్యాలెస్ లో జరిగింది.