ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ హీరోయిన్స్ లలో కత్రినా కైఫ్ ఒకరు

మోడల్ నుంచి నటిగా మారిన కత్రిన 'బూమ్ ' అనే చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు.

సూపర్-హిట్ ఐటెమ్ సాంగ్స్ తో కుర్రకారులో క్రేజ్ సంపాదించుకున్నారు.

స్లైస్, నక్షత్ర, పానాసోనిక్, లాక్మే, లోరియల్, రీబాక్ ఇండియా, ఇమామి, లినో పెరోస్ లాంటి అగ్రగామి బ్రాండ్లకు ప్రమోషన్స్ చేస్తుంది.

త్వరలోనే ఈ ముద్దుగుమ్మ.. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన 'జీ లే జరా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'జీ లే జరా' చిత్రంతో అలియా భట్, ప్రియాంక చోప్రా కూడా నటించారు.

కెరీర్ ప్రారంభంలో తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు వంటి చిత్రాల్లోనూ కనువిందు చేశారు. ఆ తర్వాత బీటౌన్ లో బిజీ అయిపోయారు.

సినిమాల్లోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ ఎక్కువే..

 ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 67 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న కైఫ్.. 

బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు సుమారు రూ. 97 లక్షలు వసూలు చేస్తుందని తాజా మీడియా నివేదిక వెల్లడించింది