వేసవి వస్తే.. శరీర ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాంటి పరిస్థితి రావొద్దంటే.. ఈ చిట్కాలు పాటిస్తే చాలు.

ప్రతిరోజూ క్రమం త‌ప్పకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగితే.. శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గి, చల్లబడుతుంది.

రోజూ ఉదయం కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేస్తే.. ఒంట్లో వేడి తగ్గుతుంది.

రోజూ రెండు కప్పులు తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగితే.. శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.

క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగిన కూడా.. శరీర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి.

కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే.. శరీరంలో  శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు.

సోంపు, జీలకర్ర, ధనియాలు రాత్రంతా నానబెట్టి.. ఆ మరుసటి రోజు తాగితే, ఒంట్లో వేడి తగ్గుతుంది.

రెండు మూడు రోజులకు ఒకసారైనా దానిమ్మ గింజలు తినడం లేదా దానిమ్మ రసం తాగితే.. శరీరం చల్లగా ఉంటుంది.

మెంతులను వేయించి, పొడిచేసి.. గోరు వెచ్చటి నీటితో కలిపి తాగితే.. ఒంట్లో వేడిని తగ్గిపోతుంది.

పుల్లటి పండ్లు, బీట్‌రూట్‌లు, క్యారెట్‌లను వేసవిలో ఎక్కువగా తింటే.. శరీర ఉష్ణోగ్రతలను అదుపులో పెట్టుకోవచ్చు.