పరగడుపున ఒక టీ స్పూన్ నెయ్యి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు.
ఖాళీ కడుపున నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.
నెయ్యి ఎముకల బలాన్ని పెంచుతుంది. ఎముక సాంద్రతను పెంచుతుంది.
బోలు ఎముకల వ్యాధిని, ఎముక పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు కాలేయంలో కీటోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీంతో శక్తి లభిస్తుంది.
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ అనేది శోషరస వ్యవస్థను ప్రేరేపిస్తుంది. రోగనిరోధక పనితీరు మెరుగువుతుంది.
కానీ.. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు నెయ్యికి దూరంగా ఉండాలి.
గ్యాస్, అజీర్ణం లేదా ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారిలో నెయ్యి జీర్ణం కాకపోవచ్చు.
లివర్ వ్యాధులతో బాధపడుతున్న వారు నెయ్యిని తీసుకోవడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.