సగ్గు బియ్యంలో శరీరానికి చలువ చేసే లక్షణాలున్నాయి. వీటిని పాలు, చక్కెర పోసి పాయ‌సంలా వండుకుని తింటే చలువ చేస్తుంది.

ఎండలో తిరిగే వారు ఈ సగ్గుబియ్యం పాయ‌సం తీసుకుంటే వడదెబ్బకు గురికాకుండా కాపాడుతుంది.

వేసవి కాలంలో కొంచెం పనిచేసినా త్వరగా అలసిపోతాం. శరీరంలో శక్తి త్వరగా తగ్గిపోతుంది. అలాంటి వారు సగ్గుబియ్యం తిసుకుంటే తక్షణమే శక్తి లభిస్తుంది.

 ఊబ‌కాయం ఉన్నవాళ్లు ఈ సగ్గుబియ్యం తీసుకోవడంవల్ల శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది.

శరీరంలోని కొలెస్టరాల్ స్థాయిలు స‌మ‌తాస్థితిలో ఉంటాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండటమేగాక బరువు కూడా తగ్గుతారు.

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు సగ్గు బియ్యం తింటే ఆ సమస్యల నుంచి క్రమంగా బయట పడవచ్చు.

గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలకు కూడా సగ్గు బియ్యంతో పరిష్కారం లభిస్తుంది.

విరేచనాలు అయినప్పుడు సగ్గు బియ్యం తీసుకుంటే తక్షణమే ఫలితం కనిపిస్తుంది.

జ్వరం, విరేచనాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యాన్ని జావ రూపంలో తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

సగ్గు బియ్యం కండరాలు బలపడటానికి కూడా ఉపయోగపతాయి. విటమిన్‌ K ఉండటంవల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.