గ్రేటర్ పోరు.. వైసీపీ కీలక ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి... ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా... పేర్లు ప్రకటించకపోయినా.. జాబితాలో ఉన్నవారికే నామినేషన్ వేసుకోవాలని ఇప్పటికే సమాచారం అందించారు. ఈ తరుణంలో గ్రేటర్ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
గ్రేటర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదంటూ ఓ ప్రకటన విడుదల చేశారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్రెడ్డి... రాబోయే రోజుల్లో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని.. ఈ విషయాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి అభిమానులు గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు శ్రీకాంత్రెడ్డి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)