పులికోసం కొనసాగుతున్న ఆపరేషన్...
కొమరం భీం జిల్లాలో పులుల సంచారం ఎక్కువైంది. పశువులు, మేకలతో పాటుగా మనుషులపై కూడా పులులు దాడులు చేస్తుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో పులులు సంచరించే 8 ప్రాంతాలను అటవీశాఖాధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. పులిని పట్టుకోవడం కోసం మత్తుమందు ఇచ్చే బృందాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ నుంచి ప్రవీణ్, మహారాష్ట్ర తడోబా టీమ్ నుంచి రవికాంత్ నిపుణులతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నది. పులిని బంధించేందుకు షార్ప్ షూటర్లు రంగంలోకి దిగారు. వీలైనంత త్వరగా పులిని పట్టుకుంటామని అటవీశాఖాధికారులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)