ఐపీఎల్లో ఉత్కంఠపోరు.. ఎట్టకేలకు పంజాబ్ విజయం
డ్రీమ్ ఎలెవన్ ఐపీఎల్ థర్టింత్ సీజన్లో.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండో విజయాన్ని దక్కించుకుంది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 61 పరుగులతో కేఎల్ రాహుల్.. 53 రన్స్తో క్రిస్గేల్ మెరవడంతో.. పంజాబ్ను ఎట్టకేలకు విజయం వరించింది. అయితే, వీరిద్దరి మెరుపులు చేసి పంజాబ్ సునాయసంగా గెలుస్తుందనుకునే అంచనాలు ఏర్పడిన వేళ.. చివరి ఓవర్లో ఉత్కంఠ ఏర్పడింది.
ఆరు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా.. ఇంకో రెండు బాల్స్లో పంజాబ్ విక్టరీ ఖాయం అనుకున్నారంతా.. కానీ, చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. చివరి బంతి వరకూ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలి రెండు బంతులు డాట్ బాల్స్ కాగా.. మూడో బంతికి గేల్ సింగిల్ తీశాడు. నాలుగో బాల్ డాట్ కాగా.. ఐదో బంతికి గేల్ రనౌటయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, గేల్ ప్లేస్లో వచ్చిన పూరన్.. చివరి బంతికి సిక్సర్ కొట్టి.. పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచాడు. 45 రన్స్ కొట్టిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. పంజాబ్కు మంచి ఆరంభాన్నిచ్చాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్.. 20ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఓపెనర్లిద్దరూ తొందరగానే పెవిలియన్ చేరడంతో పాటు డివిలియర్స్ రెండు పరుగులకే ఔటవడంతో.. భారమంతా కెప్లెన్ కోహ్లీపై పడింది. 48 పరుగులు చేసిన విరాట్.. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో క్రిస్మోరిస్ 25 రన్స్ చేయడంతో.. జట్టు స్కోరు 170 దాటింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)