షాకింగ్ : ఇర్ఫాన్ పఠాన్కు కరోనా పాజిటివ్
ప్రస్తుతం మన దేశంలో కరోనా మళ్ళీ వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ జరుగుతున్న కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్లో ప్రకటించాడు. లక్షణాలు లేకున్నా... పరీక్షలు చేయించుకోగా.. కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. కాగా.. ఇటీవల రాయ్పూర్లో ముగిసిన రోడ్సేఫ్టీ వరల్డ్ సిరీస్లో పాల్గొన్న ఆటగాళ్లకే కరోనా సోకుతోంది. ఇప్పటికే ఈ సిరిస్లో ఆడిన సచిన్, యూసుఫ్ పఠాన్, బద్రీనాథ్కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ సిరిస్లో ఇర్ఫాన్ పఠాన్ కూడా పాల్గొనడం విశేషం.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)