ఐపీఎల్ వేలం : ఏ ఫ్రాంఛైజీ పరిస్థితి ఎలా ఉంది...?
చెన్నై లోని ఓ హోటల్ లో ఈ రోజు 3 గంటలకు ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. అయితే ఈ వేలంలో మొత్తం 292 మంది ప్లేయర్స్ ఉండగా ఇందులో 164 మంది ఇండియన్ క్రికెటర్లు 125 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ప్లేయర్లుకూడా ఉన్నారు. అయితే వీళ్ల నుంచి 61 మంది క్రికెటర్లను మాత్రమే ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఆరుగురు ప్లేయర్లను తీసుకోనుంది. దీని కోసం 19 కోట్ల 90 లక్షలను వెచ్చించనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ 8 మంది ఆటగాళ్లను తీసుకోవడానికి 13 కోట్లను ఖర్చు చేయనుంది.
పంజాబ్ కింగ్స్ 9 మందిని వేలంలో తీసుకోవచ్చు. ఇందుకోసం 53 కోట్లను కేటాయించనుంది.
కోల్కతా నైట్రైడర్స్ 8 మంది క్రికెటర్లను తీసుకునే అవకాశం ఉంది. అందుకు వేలంలో 10 కోట్ల 75 లక్షలను వెచ్చించనుంది.
ముంబై ఇండియన్స్ ఏడుగురు ప్లేయర్లను 15 కోట్ల 35 లక్షలు వెచ్చించి తీసుకునే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ కూడా 9 మంది ఆటగాళ్ల కోసం 15 కోట్ల 35 లక్షలను ఖర్చు చేసే అవకాశం ఉంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 14 మంది ప్లేయర్ల కోసం 35 కోట్ల 4 లక్షలు కేటాయించనుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ కూడా అందరికంటే తక్కువగా ముగ్గురు ప్లేయర్లను 10 కోట్ల 75 లక్షలు వెచ్చించి వేలంలో తీసుకునే అవకాశం ఉంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)