మగువలకు షాక్ : భారీగా పెరిగిన బంగారం ధరలు
ఇండియాలో అత్యధికంగా కొనుగోలు చేసే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. అందుకే బంగారానికి దేశంలో డిమాండ్ అధికంగా ఉంటుంది. ధరలు ఎప్పుడు ఆకాశంలోనే ఉంటాయి. ఏ మాత్రం ధరలు తగ్గినా, పెద్ద సంఖ్యలో బంగారం కొనుగోలు జరుగుతుంది. అయితే.. కరోనా విజృంభణ తర్వాత బంగారం ధరలకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే.. ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి బంగారం ధరలు. తాజాగా.. మహిళలకు మరో షాక్ ఇచ్చాయి బంగారం ధరలు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 750 పెరిగి రూ. 45, 900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 810 పెరిగి రూ. 50, 070 కి చేరింది. ఇక బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం కాస్త తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ. 67, 300 కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)