ఐపీఎల్ వేలంలో శ్రీశాంత్ ను తీసుకునేది ఎవరు...?
బీసీసీఐ విధించిన నిషేధం పూర్తికావడంతో ప్రస్తుతం దేశవాళీ మ్యాచ్లలో ఆడుతున్నాడు శ్రీశాంత్. ఇప్పుడు ఐపీఎల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమంటున్నాడు. రానున్న 2021 ఐపీఎల్ సీజన్లో తనను ఏదో ఒక జట్టు వేలంలో తీసుకుంటుందని అతడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అయితే శ్రీశాంత్ను వేలంలో తీసుకునేందుకు మూడు జట్లు ఆసక్తి చూపించవచ్చు. శ్రీశాంత్ను తీసుకునే అవకాశం ఉన్న మొదటి టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్. ఐపీఎల్ ప్రారంభం నుంచి పంజాబ్ టీమ్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేదు. నాణ్యమైన పేస్ బౌలింగ్ లేకపోవడంతో, డెత్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోవడంవల్ల మ్యాచ్లు గెలవలేకపోతున్నామని టీమ్ మేనేజ్మెంట్ కూడా గుర్తించింది. దీంతో శ్రీశాంత్ వంటి అనుభవం ఉన్న బౌలర్ను తీసుకుంటే తమకు ఉపయోగపడవచ్చని ఆ జట్టు భావిస్తోంది.
గత ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో ఇండియన్ పేసర్కు స్థానం ఉంది. అందుకే శ్రీశాంత్ను తీసుకుంటే, బౌలింగ్ విభాగం బలపడుతుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. దీనికి తోడు ఫిక్సింగ్ కుంభకోణం బయపడినప్పుడు అతడు రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్, గత సీజన్లో చెత్త ఆటతో గేమ్ నుంచి నిష్క్రమించింది. దీంతో 2021 సీజన్కోసం జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీనియన్ ప్లేయర్లు చాలామందిని చెన్నై వదులుకుంది. గతంలో ధోని కెప్టెన్గా ఉన్నప్పుడు శ్రీశాంత్ టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్గా ఎదిగాడు. అందుకే శ్రీశాంత్పై ధోనీ దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)