పబ్జికి బానిసై ... ఆహారం తీసుకోవడం మానేసి... చివరకు ఇలా...
పబ్జి గేమ్ యువకుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. పబ్జి గేమ్ ను ఆడటం మొదలుపెడితే క్రమంగా దానికి బానిస కావాల్సి వస్తుంది. ఫలితంగా జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటీవలే ఓ యువకుడు పబ్జికి బానిసయ్యి... తన తల్లిదండ్రుల అకౌంట్ ను ఖాళీ చేశాడు. ఇలానే ఓ యువకుడు ఈ గేమ్ కు బానిసయ్యి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని జాజులకుంట గ్రామంలో జరిగింది.
పబ్జికి బానిసైన యువకుడు ఆట మత్తులో పడి భోజనం చేయడం మానేశాడు. కనీసం నీళ్లు కూడా తాగడం మర్చిపోవడంతో, కొన్నాళ్ల తరువాత అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో తల్లిదండ్రులు ఆ యువకుడిని ఆసుపత్రిలో జాయిన్ చేసి చికిత్స అందించారు. ఆహరం తీసుకోకపోవడంతో శరీరం డీహైడ్రేషన్ అయ్యిందని, డయేరియా బారిన పడినట్టు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువకుడు కన్నుమూశాడు. చేతికి అందివచ్చిన కొడుకు మరణించడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)