తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను నియమిస్తూ ఈరోజు జాబితా విడుదల చేశారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలను జిల్లా అధ్యక్షులుగా నియమించారు. అంతేకాకుండా ఈ జాబితాలో ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జెడ్పీ ఛైర్మన్లు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.
జిల్లాల వారీగా టీఆర్ఎస్ అధ్యక్షుల జాబితా:
ఆదిలాబాద్: జోగురామన్న, ఆసిఫాబాద్: కోనప్ప, మంచిర్యాల: బాల్కసుమన్, నిర్మల్: విఠల్ రెడ్డి, నిజామాబాద్: జీవన్ రెడ్డి, కామారెడ్డి: ముజీబుద్దీన్, కరీంనగర్: రామకృష్ణారావు, సిరిసిల్ల: తోట ఆగయ్య, జగిత్యాల: విద్యాసాగర్రావు, పెద్దపల్లి: కోరుకంటి చందర్, సిద్దిపేట: కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్: పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి: చింతా ప్రభాకర్, వరంగల్: ఆరూరి రమేష్, హన్మకొండ: వినయ్ భాస్కర్, జనగామ: సంపత్ రెడ్డి, మహబూబాబాద్: మాలోతు కవిత, ములుగు: కుసుమ జగదీష్, భూపాలపల్లి: గండ్ర జ్యోతి, ఖమ్మం: తాతా మధుసూదన్, భద్రాద్రి: రేగా కాంతారావు, నల్గొండ: రవీంద్రనాయక్, సూర్యాపేట: లింగయ్య యాదవ్, యాదాద్రి: కంచర్ల రామకృష్ణారెడ్డి, రంగారెడ్డి: మంచిరెడ్డి కిషన్రెడ్డి, వికారాబాద్: మెతుకు ఆనంద్, మేడ్చల్: శంభీపూర్ రాజు, మహబూబ్నగర్: లక్ష్మారెడ్డి, నాగర్కర్నూలు: గువ్వల బాలరాజు, గద్వాల: కృష్ణమోహన్రెడ్డి, నారాయణపేట: రాజేందర్రెడ్డి, వనపర్తి: గట్టు యాదవ్, హైదరాబాద్: మాగంటి గోపీనాథ్