సీఎం కేసీఆర్ పై షర్మిల మరోసారి విమర్శలు చేశారు. ట్విట్టర్ వేదికగా టీఆర్ఎస్ పై విమర్శల దాడులకు దిగారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు, 7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు, డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి ఐదు, పది చదవని వాళ్లను మంత్రులు చేసినందుకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో 4 ఉద్యోగాలు ఇచ్చుకున్నందుకు, నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోనందుకు కేసీఆర్ గారు సిగ్గుపడాలి. అవమానంతో తలదించుకోవాలి.చదువుకున్న యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుందని విద్యార్థులను మోసం చేసినందుకు,
— YS Sharmila (@realyssharmila) January 25, 2022
7 ఏండ్ల పాలనలో నోటిఫికేషన్స్ ఇవ్వనందుకు,
డిగ్రీలు చదివిన వాళ్లను హమాలీ పని చేసుకునేలా, పీజీలు చదివిన వాళ్లను
రోడ్ల మీద ఛాయ్ అమ్ముకునేలా చేసి
ఐదు, పది చదవని వాళ్లను
మంత్రులు చేసినందుకు, 1/2 pic.twitter.com/lMZRnAEEDz