పాల్వంచ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. . ఈ కేసులో ఏ-2 గా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కాగా తాజాగా ఈ కేసులో ఏ-2, ఏ-4 గా రామకృష్ణ తల్లి, సోదరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. ఖమ్మం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
Read Also: అలెర్ట్ : తెలంగాణకు మూడు రోజుల పాటు వర్షాలు
అయితే పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ కుటుంబాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ బెదింరిచారని, వేధింపులకు గురి చేశారని కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. దీంతో వనమా రాఘవ ను పోలీసులు ఎనిమిది బృందాలతో గాలించి చివరికి అరెస్టు చేశారు. అలాగే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రామకృష్ణ తల్లి, సోదరి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో ఏ-2 గా వనమా రాఘవ ఉన్నాడు. అలాగే ఏ-3 గా రామకృష్ణ తల్లి, ఏ-4 గా రామకృష్ణ సోదరి ఉంది. దీంతో పోలీసులు ఈ రోజు వీరిని అరెస్టు చేశారు.