ఉక్రెయిన్ యుద్ధం దెబ్బతో అక్కడ మెడికల్ విద్యనభ్యసిస్తున్న వేలాదిమంది తిరుగుముఖం పట్టారు. మనదేశంలో వారందరికీ విద్యను పూర్తిచేసే అవకాశం వుంటుందా? విద్యార్థుల భవిష్యత్తేంటి..? అందరికి సీట్లు సర్దుబాటవుతాయా?
భవిష్యత్తులో ఉక్రెయిన్ లో చదివే అవకాశం వుంటుందా? అయిందంతా పోసి వారిని అక్కడికి పంపారు. ఏజెన్సీలు ఊదరగొట్టి మరీ చైనా, రష్యా, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్ దేశాలకు పంపారు. వందలాదిమంది తెలంగాణ విద్యార్ధులు 700మందికి పైగా ఆపరేషన్ గంగలో ఇక్కడికి తెచ్చారు. కేంద్రంతో మాట్లాడి వారికి అయ్యే ఖర్చు తామే భరిస్తామన్నారు తెలంగాణ సీఎం. నేషనల్ మెడికల్ కమిషన్ సాయంతో వారి విద్యకు ఆటంకాలు లేకుండా చూస్తామని ఏపీ, కేరళ రాష్ట్రాలు కూడా ప్రకటించాయి.