తెలంగాణలో రిజిస్ట్రేషన్ ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. ఛార్జీలు భారీగా పెరగడంతో రిజిస్ట్రేషన్లు భారంగా మారాయి. రాష్ట్రంలో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు 50 శాతం, ఖాళీ స్థలాలవి 35 శాతం, అపార్ట్మెంట్ ఫ్లాట్ల విలువను 25-30 శాతం పెంచింది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. దీంతో రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గాయి. జనవరి 31 అర్థరాత్రి వరకూ భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతంలో ఉన్న మార్కెట్ విలువలకు, ప్రతిపాదించిన విలువల మధ్య సరాసరి వ్యత్యాసం 35-40 శాతం పైగానే ఉంది. ప్రభుత్వ మార్కెట్ విలువలకు రెండు మూడు రెట్లు అధికంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న వాటిని అత్యధిక ప్రాధాన్య ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ రేట్లు భారీగా పెంచారు.
వాణిజ్య సముదాయాల్లో అన్ని ఫ్లోర్లకు ఒకే మార్కెట్ విలువను నిర్ణయించారు. స్థలాల విలువల సగటు 35 శాతం పెరిగింది. తక్కువ విలువ ఉన్న ప్రాంతాల్లో 50 శాతం వరకూ పెరిగింది. అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు 25-30 శాతం దాకా పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. భూములు కొనాలంటే ఇక కష్టమే అంటున్నారు మధ్యతరగతి వారు.