కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం గుడ్లవల్లేరు గ్రామ సచివాలయం-2 పై ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. పట్టాదారు పాస్ బుక్ జారీకి గ్రామ వీఆర్వో వసుంధర 5 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. మండలంలోని వేమిగుంట గ్రామంలో ఉన్న రెండున్నర ఎకరాల భూమికి పట్టాదారు పాసుపుస్తకం జారీకి దరఖాస్తు చేయగా 5 వేలు లంచం డిమాండ్ చేశారు వీఆర్వో వసుంధర.
భూమి సూపర్వైజర్ సురేష్ ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శరత్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో వీఆర్వో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో ఏసీబీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు.