NTV Telugu Site icon

Karnataka: 65 ఏళ్ల వృద్ధురాలికి 33 ఏళ్ల మహిళా లెక్చరర్ కాలేయం దానం.. చివరికిలా..!

Karnataka1

Karnataka1

అవయవ దానం చేయడం మంచిదే. అది ఎప్పుడు చేయాలి.. కోమాలో ఉన్నప్పుడో.. లేదంటే చనిపోయాక చేయడం మంచిదే. అంతేకాని చిన్న వయసులో.. పసి బిడ్డలు కలిగిన వారు చేయడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఇదంతా ఎందుకంటారా? ఒక వృద్ధురాలికి అవయవ దానం చేసి యువతి తనువు చాలించింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ ఘటన పలువురి హృదయాలను కలిచివేస్తోంది. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

అర్చన కామత్ అనే 33 ఏళ్ల మహిళా లెక్చరర్.. కర్ణాటకలోని మంగళూరులో తన అత్తగారి సోదరికి 60 శాతం కాలేయం దానం చేసింది. ఆ వృద్ధురాలిని అర్చన కామత్ చాలా ప్రియమైనదిగా భావించింది. ఆమెను ఎంతగానో ప్రేమించి.. ఆమె ఆరోగ్యానికి తోడ్పడాలని భావించింది. అంతే ఆ వృద్ధురాలికి అర్చన కామత్.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో లివర్‌ దానం చేసింది. అయితే మూడు రోజుల తర్వాత సర్జరీ విఫలమైంది. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆరోగ్యం క్షీణించి అర్చన కామత్ (33) ప్రాణాలు వదిలింది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అర్చన కామత్‌కు నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు.

అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చంటి బిడ్డ ఉన్న తల్లిని కాలేయం ఇవ్వడానికి కుటుంబ సభ్యులు ఎలా ఒప్పుకున్నారని నిలదీస్తున్నారు. భర్త అంటే మరొక పెళ్లి చేసుకుంటాడు. బిడ్డకు తల్లిని ఎవరు తీసుకొస్తారని మరొకరు ప్రశ్నిస్తున్నారు. మానసిక నిపుణులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలాంటి చర్య ఆమోద యోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.