ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న లింగవివక్షపై మరోసారి నోరు విప్పింది తాప్సీ. ఇటీవల తను నటించిన ‘హసీనా దిల్రూబా’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్లో పారితోషికపు అసమానత గురించి వ్యాఖ్యానించారామె. మహిళా నటులు ఎక్కువ డబ్బు అడిగితే కష్టంగా…సమస్యాత్మకంగా భావిస్తారు. అదే హీరోలు తమ పారితోషికాలను పెంచితే… అది వారి విజయానికి చిహ్నంగా ఫీలవుతారు. నాతో పాటు కెరీర్ ప్రారంభించిన హీరోలు ఇప్పుడు నా కంటే ఐదు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లు తక్కువ బడ్జెట్తోనే రూపొందుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాప్సీకి సోనమ్ కపూర్ కూడా వత్తాసు పలికారు. మహిళలకు తక్కువ మార్కెట్ ఉన్నందున వారికి తక్కువ వేతనం ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తూ… నటీమణులలో ఎంత నైపుణ్యం ఉన్నా… హీరోల స్థాయిలో వసూళ్ళను తెచ్చిపెట్టే శక్తి వారికి లేదు అన్నారు. తాప్సీ నటించిన ‘హసీన్ దిల్రూబా’ విడుదల కాగా… సోనమ్ ‘బ్లైండ్’తో బిజీగా ఉంది.